వరిధాన్యం కోనుగోలు సమస్యలపై రైతుల పక్షాన కాంగ్రెస్ మహా ధర్నా రాస్తారోకో

Published: Friday November 26, 2021

జగిత్యాల, నవంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతనలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి నేతృత్వంలోని వరిదాన్యం కోనుగోలు అంశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జగిత్యాల జిల్లా కేంద్రంలోని మహా ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వంపై నినాదాలు చేస్తూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. వరిధాన్యాన్ని తప్పతాలు కటింగ్ తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు రైతుల ఖాతాలో వెంటనే జమ చేయాలని నినాదాలు చేస్తూ తహసిల్ చౌరస్తాలో రెండు గంటల పాటు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీవో మధురికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు మసర్తి రమేష్ పాత పద్మారమేష్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి శోభారాణి గిరి నాగభూషణం బండ శంకర్ బలుమురి లక్ష్మన్ రావు గుడిసె జితేందర్ కొండ్ర రాంచందర్ రెడ్డి చేరిపూరి సుభాష్ జున్ను రాజేందర్ నక్క జీవన్ కల్లేపల్లి దుర్గయ్య సిరాజోద్దీన్ గుండ మధు కట్ట శివ ఎలుగందుల కిరణ్ కుమార్ కొత్త మోహన్ నందయ్య వివిధ మండలాల అధ్యక్షులు కార్యదర్శులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.