సీజనల్ అరోగ్య వైద్య శిబిరం
Published: Saturday July 16, 2022
జన్నారం రూరల్, జూలై 15, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సీజనల్ ఆరోగ్య శిబిరం శుక్రవారం ప్రారంభించినారు, మంచిర్యాల జిల్లా ఎంపీటీసీ ల సంగం అధ్యక్షుడు యండి రియజాద్దీన్ చేతుల మీదుగా రక్త పరీక్ష చేసి మందులు ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో జన్నారం సర్పంచ్ బి.గంగాధర్ గౌడ్, ఉప సర్పంచ్ రవి, పంచాయతీ కార్యదర్శి శ్రీపల్ అజహర్, ఏ ఎన్ ఎం లు, ఆశ వర్కర్లు, పాల్గొన్నారని, అదేవిధంగా రోటిగూడ గ్రామంలో వరద బాధితుల పునరావాస కేంద్రల వద్ద వైద్య శిబిరం ఎర్పాటు చేసి ముంపు కుటుంబాల ప్రజలకు మందులు ఇవ్వడం జరిగిందని మండల వైద్యాదికారి డాక్టర్ ప్రసాద్ రావు, కే కమలాకర్, జే పోసాని, దేవమ్మ, రషీద్ ఖాన్, శారద, తిరుమల, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: