సీసీ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : టీఆర్ఎస్ నాయకులు పప్పుల అంజిరెడ్డి
Published: Tuesday April 20, 2021
మేడిపల్లి, ఏప్రిల్19 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్ కెనరా నగర్లో చేపట్టిన సీసీ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీఆర్ఎస్ నాయకులు పప్పుల అంజిరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం నాడు సీసీ రోడ్ పనులను మున్సిపల్ కార్పొరేషన్ ఏఈ వినీల్ తో కలిసి టీఆర్ఎస్ నాయకులు పప్పుల అంజిరెడ్డి పరిశీలించి, నాణ్యతలో లోపం లేకుండా చూడాలని తెలిపారు
Share this on your social network: