గిరివికాస్ పెండింగ్ పనులను 3 రోజులలో పూర్తి చేయాలి

Published: Wednesday March 24, 2021

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆసిఫాబాద్ జిల్లా మార్చి23 (ప్రజాపాలన, ప్రతినిధి): జిల్లాలో పెండింగ్లో ఉన్న గిరి వికాస్ పనులను సంబంధిత శాఖ అధికారుల సమన్యాయంతో 3 రోజులలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి భవిష్ మిశ్రా తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో గిరి వికానం, ఎకనామిక్ సపోర్ట్ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరి వికానం పనులు మూడు రోజులలో పూర్తి చేయాలని విద్యుత్ శాఖ, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ. అధికారులను ఆదేశించారు. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ లో భాగంగా పెండింగ్లో ఉన్న 95 యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని సంబంధిత బ్యాంకుల అధికారులకు సూచించారు. అనంతరం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, కమిషనర్ క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ చెంచు రామయ్య, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మన్నెమ్మ, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి నవజీవన్, డి పి ఎం రామకృష్ణ, విద్యుత్ ఈ ఈ, డి ఈ, ఏఈలు, సంబంధిత శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.