జగిత్యాల జిల్లా గిన్నిస్ రికార్డు గ్రహితకు పద్మశాలి సంఘం సన్మానం
Published: Tuesday May 31, 2022
జగిత్యాల, మే 30 (ప్రజాపాలన ప్రతినిధి): జిల్లా కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ అతి చిన్న సైజ్ లో ఎలుకల బోను సృష్టించి గిన్నిస్ బుక్ లో చోటుదక్కించుకున్నాడు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ పద్మశాలి సేవా సంఘం సభ్యులు గుర్రం దయాకర్ ను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో అధ్యక్షుడు ఆకుబత్తిని శ్రీనివాస్, కౌన్సిలర్ గంగా సాగర్, తెరాస నాయకులు భోగ ప్రవీణ్, భోగ రాజు, అడెపు రాజేష్, గణేష్, కొక్కుల రాజేష్, భోగ, శ్రీనివాస్, అరవింద్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: