నూతన బాధ్యతలు తీసుకున్న ఎస్.ఐ ను మర్యాదపూర్వకంగా కలిసిన పాత్రికేయులు
Published: Tuesday July 26, 2022
కోరుట్ల, జూలై 25 (ప్రజాపాలన ప్రతినిధి):
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్.ఐ రామ్ చందర్ గౌడ్ ని మండల రిపోర్టర్లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించారు. అనంతరం రిపోర్టర్ దర్శనలా లతీష్ మాట్లాడుతూ కథలాపుర్ మండలానికి వచ్చిన ఎస్.ఐ రామ్ చంద్రం గౌడ్ కి మా రిపోర్టర్లు తరపున ప్రత్యేక ఆహ్వానం మన మండలంలో శాంతిభద్రతలను కాపాడే విషయం లో పోలీసుశాఖకు మా పాత్రికేయుల తరపున పూర్తి మద్దతు ఉంటుదని, అలాగే ప్రజల సమస్యలను మీ దృష్టికి తీసుకు వచ్చే ప్రయత్నం మేము చేస్తామని దర్శనలా లతీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మర్రిపెల్లి నవీన్, తోగిటి సంతోష్, రాధారపు నరేష్, గుండేటి ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: