టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు : ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

Published: Wednesday April 28, 2021

పరిగి, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం, దోమ మండల కేద్రంలో మంగళవారం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరిగి ఎమ్మెల్యేకొప్పుల మహేష్ రెడ్డిదోమ మండలకేద్రoలో ప్రధాన చౌరస్తా వద్ద  టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీఆర్‌ఎస్‌ దేశరాజకీయాల్లో చెరగని ముద్ర చేసిందని అన్నారు. 2001,ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. నాటి కార్యక్రమంలో పాల్గొన్నవారిలో అత్యధికులు 1969నాటి ఉద్యమ కారులు, విద్యావంతులు, మేధావులే అని పేర్కొన్నారు. పార్లమెంటరీ పంథాలో తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా టీఆర్ఎస్ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. అప్పట్లో ఉద్యమ ఊపిరిగా మారిన కేసీఆర్ .. రాష్ట్రంలో యువతను పెద్దవారిని అందర్నీ ఏక తాటిపై నడిపించారన్నారు. అయితే కరోనా నేపథ్యంలో పార్టీ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరపలేకపోయామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నాగిరెడ్డి. సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజి రెడ్డి. పి ఎ సి ఎస్  చైర్మన్ ప్రభాకర్ రెడ్డి. ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్ మాజీ ఎంపీపీ రాజగోపాల్ చారి. కో ఆప్షన్ ఖాజా పాషా. వెంకటయ్య.వార్డ్ సభ్యులు లక్ష్మణ్. సాయి రమేష్ మైను. తెరాస బృంద సభ్యులు పాల్గొన్నారు.