ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని అధికారులు
Published: Friday July 16, 2021
మధిర, జూలై 15, ప్రజాపాలన ప్రతినిధి : మధిర వైరా ప్రధాన రహదారిలో మధిర మున్సిపాలిటీ పరిధిలోని పాత మహీంద్రా ట్రాక్టర్ షోరూం ఎదురుగా ప్రమాదకరంగా ఉన్న మోకాళ్ళ లోతు గుంట వల్ల పలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. వర్షాకాలం కావడంతో వర్షపు నీటితో గుంట నిండి వాహనచోదకులకు అంత పెద్ద గుంత కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనాలపై వెళుతున్న కుటుంబసభ్యులు వెనుకున్న మహిళలు ఎగిరి కిందపడిన సంఘటనలు ఈ వారం రోజులుగా 5 నుంచి 6 మరియు యువకులు ఇంకా అనేక ప్రమాదాలు ప్రత్యక్షంగా చూసి చెబుతున్నాం.. దయచేసి R&B అధికారులకు సమాచారం ఇచ్చి తక్షణమే ఈ గుంతను పూడ్చాలని అక్కడి స్థానికులు.. వాహనచోదకులు కోరుతున్నారు.
Share this on your social network: