పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Published: Monday December 20, 2021
కోరుట్ల, డిసెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా జోగన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2007-2008 లో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు, ఉపాద్యాయులు కలిసి పూర్వ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉత్సహంగా గడిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ చదువు నేర్చుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండడమే ఉపాధ్యాయులకు అసలైన సంతృప్తి అని, ఈ విధంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య, ఉపాద్యాయులు లక్ష్మినారాయణ, శేఖర్, నజీర్, గిరి, రవీందర్, సంపత్, అంజయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.