కాంగ్రెస్ పూర్వవైభవానికి కార్యకర్తలలే పునాదులు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Published: Wednesday December 08, 2021

బీరుపూర్, డిసెంబర్ 07 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మాండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి నూతన కార్యకర్తలు సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి హాజరై ప్రసంగింస్తు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్ల పని చేసి పూర్వవైభవం తీసుకురావాలని దానికి కార్యకర్తలే పునాదులని జీవన్ రెడ్డి ఉద్గాటించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ప్రతి గ్రామంలో ఉవ్వెత్తున స్వీకరించే విదంగా కృషి చేయాలని సీనియర్ కార్యకర్తలకు జీవన్ రెడ్డి సూచించారు. తెరాస ప్రభుత్వం రైతులను మోసం చేసిందని వడ్ల సెంటర్లలో వరిదాన్యం పోస్తే నెల రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతే క్యాంపుల పేరుతో టూర్లకు వెళ్లి రిసార్ట్ లలో ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. ఐకేపీ సెంటర్లలను స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అభివృద్ధికి ఆజ్యం పోస్తే వాటిని నిర్వీర్యాం చేసిన ఘనత తెరాస ప్రభుత్వానిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్ ఉమ్మడి మండల్ ప్రచార కమిటీ అధ్యక్షుడు గుడిసె జితేందర్ యాదవ్ పార్టీ అధ్యక్షుడు చేరుపూరి శుభాష్ ప్యాక్స్ చైర్మన్ పోల్సాని నవిన్ రావు నారపాక కమలాకర్ జోగిరెడ్డి బదినపల్లి శంకర్ చిర్నేని శ్రీనివాస్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.