ఫార్వర్డ్ బ్లాక్ అనుబంధ సంఘాల నాయకుల ఎన్నిక మంచిర్యాల బ్యూరో, జూలై03, ప్రజాపాలన:
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనుబంధ సంఘాల నాయకులను ఆదివారం మందమర్రి పట్టణ కేంద్రంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చెన్నూరు నియోజకవర్గ కన్వీనర్, న్యాయవాది ముల్కల కనకయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల మధు హాజరై మాట్లాడారు. పార్టీ అనుబంధ సంఘాలను బలోపేతం చేయడం ద్వారానే పార్టీ అభివృద్ధి చెందుతుందన్నారు, పార్టీ బలోపేతానికి నాయకులంతా కృషి చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో తెరాసకు, భాజపాకు దీటుగా గట్టి పోటీ ఇవ్వడానికి నాయకులంతా సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు. అనంతరం పార్టీ మందమర్రి పట్టణ జాయింట్ సెక్రటరీగా మాదాసు రాజేష్, ఆల్ ఇండియా యూత్ లీగ్ పట్టణ ఉపాధ్యక్షునిగా కే. జీవన్, ఆల్ ఇండియా అగ్రగామి కిసాన్ సభ జిల్లా ప్రధాన కార్యదర్శి గా గాదె రాములు ను ఎన్నుకున్నారు. ఈ మేరకు పార్టీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల మధు నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా అగ్రగామి కిసాన్ సభ జిల్లా అధ్యక్షుడు సత్యం, టి యు సి సి సీనియర్ నాయకుడు సమద్ పాషా,పట్టణ పార్టీ ఉపాధ్యక్షుడు జి శంకర్, మండల ఉపాధ్యక్షుడు సోమారపు సామ్యుల్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: