నేడు తూటికుంట్ల లో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

Published: Wednesday February 02, 2022
బోనకల్, ఫిబ్రవరి 1 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని  తూటికుంట్ల గ్రామంలో  శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సమేత శ్రీ గోవింద మాంబాల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొననున్నట్లు క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, బోనకల్ మండలం ఇంచార్జ్ ఉమ్మినేని కృష్ణ మంగళవారం తెలిపారు. పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని పొంగులేటి పర్యటన విజయవంతం చేయాలని వారు కోరారు. వేద పండితుల నడుమ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని గ్రామాల ఆలయ కమిటీ సభ్యులు కోరారు.