భారీగా పెరిగిన గోదావరి ప్రవాహం

Published: Wednesday September 29, 2021
అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
మల్లాపూర్, సెప్టెంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలోని గోదావరి గత రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షంతో వరద ప్రవాహం వస్తుండటంతో మంగళవారం గోదావరిని మెట్ పల్లి సి.ఐ శ్రీను, తహశీల్దార్ రవీందర్, ఎస్సై రాజా నాయక్, పరిశీలించారు. తాసిల్దార్ మాట్లాడుతూ గోదావరి ప్రవాహం తగ్గేవరకు పరివాహక ప్రాంతలకు జాలర్లు ఎవరు చేపల వేటకు వెళ్లకూడదని, ప్రజలు గోదావరి వైపు వెళ్లకుండా గ్రామం మైక్ లో చెప్పించారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.