నల్లగుట్ట డంపింగ్ యార్డ్ ను ఇంటర్మిడియేట్ పాయింట్ గా చేస్తాం : ఛైర్పర్సన్ శ్రావణి

Published: Wednesday August 04, 2021
జగిత్యాల, ఆగస్టు 03 (ప్రజాపాలన ప్రతినిధి) : పట్టణ సమీపంలో నల్లగుట్ట డంపింగ్ యార్డ్ ను ఇంటర్మిడియేట్ పాయింట్ గా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ ఛైర్పర్సన్ డా.బోగ శ్రావణి ప్రవీణ్ అన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణంలో 48 వార్డులలోని ప్రజల నివాస గృహాలకు దూరంగా ఇంటర్మీడియేట్ డంపింగ్ పాయింట్ గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నమని, డంపింగ్ యార్డ్, డిఆర్ సిసి సెంటర్, కంపోస్ట్ షెడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఏ.ఈ శరణ్ తేజ, సానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వర రెడ్డి, అశోక్, రాము, విజయ్ ఉన్నారు.