ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరించిన ఎస్ ఎస్ సతీష్ కుమార్

Published: Thursday September 30, 2021
మధిర, సెప్టెంబర్ 29, ప్రజాపాలన ప్రతినిధి : అక్టోబర్ 1, 2, 3 తారీకు లలో నిర్వహిస్తున్న తెలంగాణ ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరగబోయే ఫోటో ఎక్సఫో కార్యక్రమ పోస్టర్స్ ను ఈ రోజు మధిర టౌన్ si సతీష్ కుమార్ మరియు ఖమ్మం జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు దేవర  గారు విడుదల చేశారు., ఈ ఎక్స్ ఫో కార్యక్రమంలో నూతన పరిజ్ఞానం ఫోటో గ్రాఫర్స్ కు అందించనున్నది అని, ప్రస్తుతం మారుతున్నా టేక్నాలజి రాష్ట్ర వ్యాప్తంగా ఫోటో గ్రాఫర్స్ కు అందాలని ఉద్దేశంతో ఎక్స్ ఫో కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యటం జరిగిందని అందరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చిలివేరు సాంబశివరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకట్, ఖమ్మం జిల్లా జాయింట్ సెక్రెటరీ పెనుగొండ భాస్కర్, మధిర మండల ప్రధాన కార్యదర్శి. యడవల్లి శ్రీధర్, తాళ్లూరి శ్రీనివాస్, గోకర్ల పార్వతి, కంభంపాటి నాగసాయి, యడవల్లి రాంబాబు, అంగడాల గోపినాథ్, తదితరులు పాల్గొన్నారు.