లోకకళ్యాణం కోసం హోమాలు మరియు శ్రీవారి కల్యాణం జరిపించిన పసురా గ్రూప్ అధినేత

Published: Wednesday February 24, 2021
మధిర, ఫిబ్రవరి 23, ప్రజాపాలన: మధిర సాయి బాబా దేవాలయంలో ఈ రోజున పసుర గ్రూప్స్ అధినేత పబ్బతి మోహన్ రావు శ్రీ రక్షా సుదర్శన హోమం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకు శ్రీవారి కల్యాణం జరుపుతూ స్వామి అనుగ్రహం లోక కళ్యాణము జరుపుటకు మరియు ఈ కళ్యాణ కైంకర్యము చేస్తున్న వారికి వారి కుటుంబమును వారి బంధువర్గాన్ని అలాగే లోక కళ్యాణం లో ఉన్న ప్రజలు అందరూ కూడా అష్టైశ్వర్యాలతో కలిగి ఉండాలని పసుర గ్రూప్స్ అధినేత పబ్బతి మోహన్ రావు తెలిపారు ఈరోజు ఉదయం నుండి హోమములు పూజా కార్యక్రమాలు జరిపించి భక్తులందరకు తీర్థ ప్రసాదాలు నియోగం జరిగింది