కళ్యాణలక్ష్మీ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Thursday September 23, 2021
జగిత్యాల, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండలానికి చెందిన 28 మంది అడబిడ్డలకు కళ్యాణలక్ష్మి ద్వారా మంజూరైన 28,03,248 లక్షల రూపాయల విలువగల చెక్కులను సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ అందజేశారు. అనంతరం రేచపల్లి గ్రామానికి చెందిన రైతు కర్ణాటకపు పెద్ద పొశం ఇటీవల మరణించగా పొశం కుటుంబానికి 5 లక్షల రైతుభీమా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోల జమున జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి సర్పంచ్ మండల పార్టీ అధ్యక్షుడు గుర్రాల రాజేందర్ రెడ్డి వైస్ ఎంపీపీ సోల్లు సురేందర్ రైతుబంధు మండల కన్వీనర్ కోల శ్రీనివాస్ ప్యాక్స్ చైర్మన్ ఏలేటి నరసింహరెడ్డి కో-ఆప్షన్ అమీర్ సర్పంచులు ఢిల్లీ రామారావు బొడ్డుపల్లి రాజన్న పల్లపు వెంకటేష్ బేక్యం జమున అరే లక్ష్మీ కొండ శ్రీలత పంపర్తి లక్ష్మీ ఎంపీటీసీలు జోగినపల్లి సుధాకర్ రావు భూక్య లావణ్య ఉప నాయకులు తదితరులు పాల్గొన్నారు.