కళ్యాణలక్ష్మీ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
Published: Thursday September 23, 2021
జగిత్యాల, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండలానికి చెందిన 28 మంది అడబిడ్డలకు కళ్యాణలక్ష్మి ద్వారా మంజూరైన 28,03,248 లక్షల రూపాయల విలువగల చెక్కులను సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ అందజేశారు. అనంతరం రేచపల్లి గ్రామానికి చెందిన రైతు కర్ణాటకపు పెద్ద పొశం ఇటీవల మరణించగా పొశం కుటుంబానికి 5 లక్షల రైతుభీమా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోల జమున జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి సర్పంచ్ మండల పార్టీ అధ్యక్షుడు గుర్రాల రాజేందర్ రెడ్డి వైస్ ఎంపీపీ సోల్లు సురేందర్ రైతుబంధు మండల కన్వీనర్ కోల శ్రీనివాస్ ప్యాక్స్ చైర్మన్ ఏలేటి నరసింహరెడ్డి కో-ఆప్షన్ అమీర్ సర్పంచులు ఢిల్లీ రామారావు బొడ్డుపల్లి రాజన్న పల్లపు వెంకటేష్ బేక్యం జమున అరే లక్ష్మీ కొండ శ్రీలత పంపర్తి లక్ష్మీ ఎంపీటీసీలు జోగినపల్లి సుధాకర్ రావు భూక్య లావణ్య ఉప నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: