ప్రముఖులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ సుభాష్ నాయక్
Published: Saturday October 08, 2022
మేడిపల్లి, అక్టోబర్ 7 (ప్రజాపాలన ప్రతినిధి)
దసరా పండుగను పురస్కరించుకొని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ కేతావత్ సుభాష్ నాయక్ కార్మికశాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డి, మేయర్ జక్క వెంకట్ రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిసి వారిని శాలువాలతో సన్మానించి, పుష్పగుచ్చం అందజేసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల బాల్ రాజ్, ప్రధాన కార్యదర్శి వరికల శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు రాధాక్రిష్ణ, శ్రీరామోజు శంకర్ చారి, డాక్టర్ బండారి శ్రీనివాస్, తండా శ్రీనివాస్, శివ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: