మంద కృష్ణ మాదిగను పరామర్శించిన దళిత గిరిజన బహుజన సాధికారత సంస్థ అధ్యక్షుడు : గంధం పుల్లయ్య.

Published: Wednesday September 29, 2021
బోనకల్, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : స్సీ వర్గీకరణ అమలు చేసే బాధ్యతగా కేంద్ర పెద్దలను కలుసుకొనుటకు ఢిల్లీ వెళ్లిన మంద కృష్ణ మాదిగ ఢిల్లీ హోటల్ లో ప్రమాదవశాత్తు జారీ పడి కాలికి గాయం అవడం జరిగింది .ఢిల్లీలో వైద్యులు శాస్త్ర చికిత్స నిర్వహించగా నెల రోజుల తరవాత హైద్రాబాద్ లో తన స్వగృహం చేరుకున్నారు ఈ సమాచారం తెలుసుకున్న బోనకల్ మండల దళిత గిరిజన బహుజన సాధికారత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం పుల్లయ్య హైద్రాబాద్ లో కృష్ణ మాదిగ అన్నను ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గంధం పుల్లయ్య మాట్లాడుతూ మీరు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని అశిసులతో మళ్లీ ప్రజా ఉద్యమ సంగ్రామంలోకి వచ్చి బడుగు బలహీన సామాజిక వర్గాల ప్రజల పక్షాన పోరాడాలని ఎస్సీ వర్గీకరణ సాధించే దిశగా ముందుకు వెళ్లాలి అని ప్రార్థించారు.