సమాజానికి పాత్రికేయులే మార్గదర్శకులు ** జిల్లా జడ్పీ చైర్మన్ కోవ లక్ష్మి ** (ఐజేయూ) జిల్లా అధ్
Published: Tuesday October 04, 2022
ఆసిఫాబాద్ జిల్లా అక్టోబర్ 3 (ప్రజాపాలన, ప్రతినిధి) : ప్రజలు ప్రభుత్వానికి మధ్య పాత్రికేయులు వారధిగా ఉంటూ సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని జిల్లా జడ్పీ చైర్మన్ కోవ లక్ష్మి, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్ రావు లు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడిగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన అబ్దుల్ రెహమాన్ ను వారు పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ జర్నలిస్టు ఎనలేని సేవలు చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ గాదేవేణి మల్లేష్, సింగిల్విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, అమాన్, నజీర్, జావీద్, జీవన్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: