మండల కేంద్రంలో పలు సమస్యలపై కలెక్టర్ కు వినతి పత్రం

Published: Wednesday December 14, 2022
బోనకల్, డిసెంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలో నెలకొని ఉన్న సమస్యలను కలెక్టర్ కు తెలియపరచి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అఖిలపక్ష నాయకులు కలెక్టర్ ను కోరారు. మంగళవారం జిల్లా కలెక్టర్ తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా బోనకల్ గ్రామ అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రంలో సినిమా హాల్ సెంటర్లో ట్రాఫిక్ బాగా రద్దీగా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాలను నివారించుటకు రింగ్ ఏర్పాటు చేయాలని, అలాగే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటల సౌకర్యం గా అభివృద్ధి చేయాలని వారు కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరావ, సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి తెల్లాకుల శ్రీనివాసరావు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బిల్లా విశ్వనాథం , వైయస్సార్ టిపి మండల అధ్యక్షులు ఎస్కే మౌలాలి, బిజెపి నాయకులు గంగుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.