సర్వే పకడ్బందీగా నిర్వహించాలి: సర్పంచ్ కె రాజిరెడ్డి

Published: Saturday May 08, 2021

పరిగి, 7 మే, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం, దోమ మండల కేంద్రంలోని గ్రామపంచాయతి పరిధిలో ప్రజల ఆరోగ్య పరిస్థితి పై సర్వే ను పక్కడబందిగా నిర్వహించాలని దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం పంచాయతీ కార్యాలయం లో అంగన్వాడీ. ఆశవర్కర్. మహిళా సంఘాల సిబ్బంది, గ్రామంలోని ఇంటింటికి నిర్వహిస్తున్న సర్వే పై సర్పంచ్ కె రాజిరెడ్డి సమావేశం ఏర్పాటు చేసి వారు చేస్తున్న సర్వే వివరాలు సర్వే లో చేపడుతున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. ముక్యంగా ఆరోగ్య పరిస్థితి పై నిర్వహిస్తున్న సర్వే లో ప్రతి ఇంటి లో ఎవరైనా అనారోగ్యానికి గురవతే  వారి వివరాలను ఆసుపత్రి కి అందజేయాలనీ సూచించారు. టీంలకు కేటాయించిన ఇళ్లను శుక్రవారం వరకు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. అందుకు సంబందించిన ఫార్మట్లో వివరాలను క్లుప్తంగా నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చoద్రశేఖర్ పాల్గొన్నారు.