నవాబుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం

Published: Wednesday February 01, 2023
* మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్
వికారాబాద్ బ్యూరో 31 జనవరి ప్రజా పాలన : నవాబుపేట మండల పరిధిలో ప్రతి బూత్ స్థాయి నుండి కాంగ్రెస్ కార్యకర్తలను చైతన్యవంతం చేస్తానని నవాబుపేట మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నవాబుపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు సమావేశంలో సూచించిన విధంగా వ్యవహరిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ జోడోమ్ ముగింపు యాత్ర కాదు ఇది ఆరంభం మాత్రమేనని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం త్వరలో చేపట్టనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారని అన్నారు. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవాన్ని సాధించేందుకు అహర్నిశలు కష్టపడతామని ధీమా వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆశాజ్యోతి గా నిలిచిందని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వ్యక్తిగత పార్టీ కాదని, కుటుంబ పార్టీ అంతకన్నా కాదని స్పష్టం చేశారు. అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటుందని వివరించారు. కాంగ్రెస్ పార్టీని తక్కువ చేసి మాట్లాడిన ప్రతిపక్షాలకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్రతో వెన్నులో వణుకు పుట్టించిందని తెలిపారు. అందుకే ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నాయని ఘాటుగా స్పందించారు. రాబోవు ఏ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు శక్తికి మించి పోరాడాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్త ప్రతిపక్ష పార్టీల విమర్శలను తిప్పి కొట్టాలని సూచించారు.