కాంగ్రెస్ నాయకుల సంబరాలు

Published: Tuesday June 29, 2021
టిపిపిసి రేవెంత్ రెడ్డికి ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేసిన ఎంపీపీ రవీందర్ గౌడ్
జిన్నారం మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర అ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని నియమించిన సందర్భంగా  భారీ సంఖ్యలో హాజరై ఉత్సవ ర్యాలీ నిర్బహించి,బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.అదేవిధంగా ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని టిపిపిసి నియమించినందుకు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యకర్త యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వం ప్రజల పై తీసుకునే వ్యతిరేక నిర్ణయాలకు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దీటుగా సమాధానం చెప్తామని అవినీతి పాలనను నిరంకుశ పాలనను తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశాభావాన్ని తెలిపారు ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2023 లో అధికారంలోకి తీసుకురావడానికి శాయశక్తులా నిరంతరం కష్టపడ్డామని సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి  మీద తెలంగాణ ప్రజల మీద పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెడతామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ గంగ రమేష్ బొల్లారం వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపిటిసి వడ్డే కృష్ణ, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు