బాధిత కుటుంబానికి అండగా వుంటా

Published: Friday October 01, 2021
వికారాబాద్ బ్యూ 30 సెప్టెంబర్ ప్రజాపాలన : వాగులో గల్లంతై మృతి చెందిన పులుసు మామిడి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ షేక్ ఇసాక్ పాష కుటుంబానికి అండగా ఉంటామని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి హమీ ఇచ్చారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎంపిపి కామిడి చంద్రకళ లతో కలిసి వికారాబాద్ మండల పరిధిలోని పులుసు మామిడి గ్రామంలో షేక్ ఇసాక్ పాష నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భర్తను కోల్పోయి శోక సముద్రంలో వున్న భార్య సమీనా బేగాన్ని ఓదార్చారు. వారి కవల పిల్లలను తన చేతుల్లోకి తీసుకొని ఎత్తుక్కున్నారు. పిల్లల ఆరోగ్యం బాగుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అందుకు కావలసిన ఎలాంటి అవసరం వున్న నన్ను సంప్రదించాలని అంటూ వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.