తెలుగుదేశం పార్టీ పినపాక నియోజకవర్గ ఇన్చార్జిగా తాతా మాధవి లత నియామకం. బూర్గంపాడు( ప్రజా పాల

Published: Thursday November 24, 2022

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండల పరిధిలోని సారపాక గ్రామపంచాయతీ కి చెందిన తాత మాధవి లతకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ పినపాక నియోజకవర్గం ఇన్చార్జిగా నియమిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆది నాయకత్వం నా మీద నమ్మకాన్ని ఉంచి నాకు ఈ బాధ్యతలు అప్పజెప్పిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు  చంద్రబాబు నాయుడు కి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కి తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం నాయకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను పార్టీ కార్యకర్తలను నాయకులను అందరిని కలుపుకొని పినపాక నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ముఖ్యంగా మహిళల్లోకానికి అన్ని విధాలుగా నా శక్తివంచన లేకుండా వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని అలాగే రాబోవు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడంలో మహిళలతో కలిసి ప్రధాన పాత్ర పోషిస్తానని, నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తల ఆశీస్సులతో అందరికీ సమ న్యాయం చేస్తాను అని విలేకరుల సమావేశంలో తాత మాధవి లత తెలిపారు .