బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
Published: Monday December 06, 2021
కాగజనగర్, డిసెంబర్ 5, ప్రజాపాలన ప్రతినిధి : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని ఈజ్ గాం గ్రామానికి చెందిన సిరి శెట్టి రామగౌడ్ కుమారుడు నిఖిల్ గౌడ్ ఇటీవలె రోడ్డు ప్రమాదంలో గాయపడగా విషయం తెలుసుకున్న సిర్పూర్ శాసనసభ్యులు కోనేరు కోనప్ప ఈ రోజు హైదరాబాదులోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిఖిల్ కు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి ఎలాంటి అవసరం అన్న అందుబాటులో ఉండి సాయం చేస్తానని తెలిపారు ఏమైనా సమస్య ఉంటే తనకు నేరుగా చెప్పాలని సూచించారు. ఎమ్మెల్యే తో పాటు ఈజ్ గాం సర్పంచ్ మల్లేష్ ఉన్నారు.
Share this on your social network: