*రైల్వే గేట్ నుండి కాలినడకన వెళ్లడానికి దారి ఇవ్వాలి*

Published: Friday December 30, 2022

మంచిర్యాల టౌన్, డిసెంబర్ 29, ప్రజాపాలన: రైల్వే గేట్ నుండి కాలినడకన వెళ్లడానికి దారి ఇవ్వాలి గురువారం  రోజున సి పి ఐ ఎం ఎల్  రెడ్ స్టార్ పార్టి జాడి దేవరాజ్ ఆధ్వర్యంలో మంచిర్యాల రైల్వే స్టేషన్ మేనేజర్ కు వినతి పత్రం  అందజేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కార్యదర్శి జాడి దేవరాజ్ మాట్లాడుతూ మంచిర్యాల టూ టౌన్ గా పేరు పొందిన హమలివాడ, గాంధీనగర్, గోపాల్ వాడ, తిలక్ నగర్ ,అశోక్ రోడ్, దొర గారి పల్లె, రాజీవ్ నగర్ , అమరవాది, వేములపల్లి   నుండి నిత్యం పనుల కోసం కాలినడక ద్వారా రైల్వే గేట్ నుండి వేలాది మంది వెళ్లి వచ్చేవారు వీరిలో ముకారాం చౌరస్తా అడ్డా కూలీలు, వర్తక వాణిజ్య రంగాలలో పనిచేసే మహిళలు యువతులు అత్యధికంగా ఉన్నారు. వీరి భద్రతకై రైల్వే గేట్ ద్వారా కాలినడకన వెళ్లడానికి దారి ఇవ్వవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో  టి యు సి ఐ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మాచర్ల సదానందం, ఎ ఐ ఆర్ డబ్ల్యు ఒ, మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు తాటికొండ రమాదేవి, భవన నిర్మాణ అడ్డా కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు రాములు, అధ్యక్షుడు చదువుల దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.