బాధిత కుటుంబానికి సర్పంచ్ బియ్యం పంపిణీ:

Published: Friday December 16, 2022
శంకరపట్నం డిసెంబర్ 15 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండలం ఆముదాలపల్లిలో ఇటీవల మరణించిన బుర్ర చంద్రయ్య కుటుంబ సభ్యులకు గురువారము గ్రామ సర్పంచ్ బత్తుల మానస 50kg ల బియ్యం పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. మరణించిన చంద్రయ్య కుటుంబాన్ని అన్నిరకాలుగా ఆదుకుంటామని  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు పెద్ది శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు దొంగల విజయ, బత్తుల సమ్మయ్య, గ్రామపంచాయతీ పాలకవర్గం, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.