ఈజిఎస్ సాంకేతిక సహాయకుడిపై జరిగిన అఘాయిత్యానికి నిరసన

Published: Thursday July 15, 2021
సారంగాపూర్, జులై 14 (ప్రజాపాలన ప్రతినిధి): నిర్మల్ జిల్లాలో మంగళవారం రోజున మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సాంకేతిక సహాయకుడు రాజుపైన జరిగిన అఘాయిత్యానికి నిరసనగా బుధవారం రోజున సారంగాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జె. పుల్లయ్య కార్యాలయ పర్యవేక్షణ అధికారి పద్మాలత కంప్యూటర్ ఆపరేటర్ సూర కోటిరెడ్డి సాంకేతిక సహాయకులు వినోద్ శ్రీలత కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.