ముంబై నుండి హైదరాబాద్ హై స్పీడ్ రైలు

Published: Friday November 26, 2021
జిల్లా అదనపు కలెక్టర్ మోతీ లాల్ 
వికారాబాద్ బ్యూరో 25 నవంబర్ ప్రజాపాలన : ముంబై నుండి హైదరాబాద్ హై స్పీడ్ రైలు కారిడార్ అభివృద్ధి కొసం వికారాబాద్ జిల్లాలో 124.425 భూమి అవసరమని, ఇట్టి భూ నిర్వాసితులకు భూ సేకరణ చట్టం ప్రకారం డబ్బులు అందరికి చెల్లించడం జరుగుతుందని సోషల్ రెహబిలిటేషన్ మరియు రీ - సెటిల్మెంట్ అధికారి డా.ఆనంద్ పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవనంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీ లాల్ అధ్యక్షతన వికారాబాద్ జిల్లా మీదుగా ముంబై నుండి హైదరాబాద్ వరకు హై-స్పీడ్ రైలు కారిడార్ అభివృద్ధిపై పర్యావరణ మరియు సామాజిక అంశాలపై రైతులు, జిల్లా ప్రజలతో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం జరిగినది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ హై స్పీడ్ రైలు జిల్లా ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. తెలంగాణలోని వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల మీదుగా వెళుతుందని అన్నారు. ముంబై నుండి హైదరాబాద్ వరకు పది స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముంబై, నవి ముంబై, థానే, పూనె, షోలాపూర్, లోనవాలా, గుల్బర్గా, తాండూర్, వికారాబాద్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటుందని తెలిపారు. ఈ రైలు గంటకు 330 కి. మీటర్ల వేగంతో వెళుతుందాన్నారు. రైలుకు మొత్తం పది భోగిలు ఉంటాయాని, ఒక్కో భోగిలో 70 మంది ప్రయానికులు కూర్చొవచ్చని తెలిపారు. హైదరాబాద్ నుండి ముంబైకి కేవలం మూడు గంటల్లో చేరుకోవచ్చని, అదే రైలు మార్గం ద్వారా అయితే 14 గంటల సమయం పడుతుందని చెప్పారు. వికారాబాద్ జిల్లాలోని 5 మండలాలలోని 39 గ్రామాలలో మొత్తం 124.425 హెక్టర్ల భూమి అవసరం ఉంటుందని అన్నారు. భూములు కోల్పోయిన గ్రామాల్లోని రైతులకు భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా పలువురు రైతులు మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా పరిహారం చెల్లెంచాలని కోరారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ, ఇది ప్రజాభిప్రాయం మాత్రమే నని, భూములు సేకరణ సమయంలో అందరికి న్యాయం చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా పలువురు రైతులు తెలిపిన ప్రజాభిప్రాయాలను రికార్డు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో HRS కారిడార్ ప్రాజెక్ట్ అధికారి శ్యామ్ చోగ్లె, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.