ఏఐ సి సి అధ్యక్షురాలు సోనియా మరియు రాహుల్ కేసులు ఉపసంహరించుకోవాలి- జిల్లా మహిళా కాంగ్రెస్ అధ
Published: Wednesday June 15, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 14 జూన్ ప్రజాపాలన:
ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి. సోనియా గాంధీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు శ్రీ. రాహుల్ గాంధీని
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ...రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్ మెంట్ ను వాడుకుంటున్నారు.గతంలో అనగా 2015 లోనే ముగిసిన కేసును మళ్లీ తెరపైకి తీసుకువచ్చి... గాంధీ కుటుంబానికి అక్రమంగా నోటీసులు ఇచ్చి, వారి ప్రతిష్ట కు భంగం కలిగేలా వ్యవహరిస్తుందని చూపారు. ఆ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్న నిరంకుశ, నియంతృత్వ మోడీ ప్రభుత్వ తీరును మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తూ పై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నామన్నారు.
Share this on your social network: