బి సి ల ఐక్యత కోసం ఒక్క అడుగు వేద్దాం

Published: Saturday November 05, 2022

మంచిర్యాల టౌన్, నవంబర్ 04, ప్రజాపాలన : బి సి ల ఐక్యత కోసం ఒక్క అడుగు వేద్దాం అని తెలంగాణ బి సి జాగృతి అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బి సి జాగృతి ఆధ్వర్యంలో బిసి  సమిష్టి హక్కుల పోరాటం కోసం ఒక్క అడుగుతో ఐక్యంగా అందరం కలిసి నడవాలని పిలుపునిచ్చారు. తేదీ 6- 11- 2022 ఆదివారం ఉదయం 7.30 గంటలకు మంచిర్యాల ఓవర్ బ్రిడ్జి దగ్గర నుండి ముఖరాం చౌరస్తా, మార్కెట్ రోడ్డు నుండి బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ వరకు 2కె వాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో ఉన్న బి సి కుల బాంధవులు అందరూ   పాల్గొనీ బిసి ఐక్యతను చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బి సి  జాగృతి మంచిర్యాల పట్టణ అధ్యక్షులు మడుపు రాంప్రకాష్, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు మెంత్యాల సంతోష్, తదితరులు పాల్గొన్నారు.