తెలంగాణ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట.... --ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్

Published: Tuesday December 27, 2022

జగిత్యాల, డిసెంబర్ 21(ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ అర్బన్ హౌసింగ్ కాలని కెసిఆర్ నగర్ లో 4520 డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లో 9 కోట్ల 6 లక్షల తో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు  చేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ శంకుస్థాపన చేసినారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మెన్ డా.చంద్ర శేకర్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, కమిషనర్ డా. నరేష్, ఈఈ లు రహమాన్, శేకర్ రెడ్డి, డిఈ లు రాజేశ్వర్, మిలింధ్, జలంధర్ రెడ్డి, డిఎస్పి ప్రకాష్, కౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.