పినపాక నియోజకవర్గం లో తెరపైకి తెలుగుదేశం పార్టీ.

Published: Wednesday October 19, 2022

 బూర్గంపాడు మండలం (ప్రజా పాలన.)

ఈరోజు పినపాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం పినపాకలో వట్టం నారాయణదొర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాలకు అనుగుణంగా సభ్యత్వలను ముమ్మరంగా నియోజకవర్గం లో అన్ని మండలాల్లో సభ్యత్వనమోదును చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  పోటు రంగారావు, ఐ టి సి గుర్తింపు సంఘం అధ్యక్షులు కనకమేడల హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొనగా , పార్లమెంటు కార్యదర్శి వాసిరెడ్డి చలపతిరావు TNTUC చైర్మన్ గల్లా నాగభూషయ్య , బిసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఉరుమెల్ల మధుసూదనరావు, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాయం లక్ష్మినారాయణ బూర్గంపాడు మండల టిడిపి అధ్యక్షులు తాళ్లూరి జగదీశ్వరరావు, పినపాక మండల అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు, కరకగూడెం మండల అధ్యక్షులు సిరి శెట్టి కమలాకర్, గుండాల మండల కార్యదర్శి ఇల్లెందుల అప్పారావు, పార్లమెంటు కార్యదర్శులు ఎస్ఎస్ రెడ్డి, కంచేటి వెంకటేశ్వ రావు, సీనియర్ నాయకులు ఇల్లెందుల నరసింహులు, మహిళా అధ్యక్షురాలు కర్మునిషా బేగం, తెలుగు యవత నాయకులు నెట్టెం భాస్కర్, మల్లిడి లోకేశ్వరరావు, తోటకూర శ్రీనివాస్, ఎస్సీ సెల్ నాయకులు అంతోటి గురవయ్య, నరసింహారావు, కొంపల్లి నాగేశ్వరరావు, ఎస్ కె నబి, యార్లగడ్డ రాజా.