అభివృద్ధి పనులను పరిశీలించిన సిఈఓ
Published: Thursday April 29, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని చిత్తాపురం గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కృష్ణారెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో కొనసాగుతున్న పల్లె ప్రకృతి వనం,స్మశాన వాటిక,కంపోస్టు యార్డు,నర్సరీ నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గీతారెడ్డి పంచాయతీ కార్యదర్శి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: