ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Published: Monday August 16, 2021
మేడిపల్లి, ఆగస్ట్15 (ప్రజాపాలన ప్రతినిధి) : 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఏసీపీ రంగస్వామి, ఉప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్లు గోవిందరెడ్డి, కాశీ విశ్వనాథ్, ఎస్ఐ జయరామ్ లు పాల్గొని ప్రెస్ క్లబ్ సభ్యులతో కలిసి ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రంగస్వామి మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల పుణ్యఫలమే భారత దేశానికి స్వాతంత్రం వచ్చిందని తెలిపారు. దేశ స్వాతంత్రం కోసం మహానుభావులు వారి ప్రాణాలను సైతం త్యాగం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతుల వెంకట్రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి కూకుట్ల నరోత్తం రెడ్డి, కార్యనిర్వాహణ అధ్యక్షులు వేముల తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు మాదిరాజ్ సురేష్ కుమార్, పారెల్లి సాగర్, అమ్మిశెట్టి శ్రీధర్ రావు, కోశాధికారి యాదగిరి, కార్యదర్శులు అశోక్, దాసరాజు, శేఖర్ ముఖ్య సలహాదారులు చంద్రమౌళి, పల్లా మహేందర్ రెడ్డి, రాంప్రసాద్ శర్మ, కంచు శ్రీనివాస్, శ్రీశైలం, రాజు, శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.