జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు..

Published: Wednesday April 06, 2022
తల్లాడ, ఏప్రిల్ 5 (ప్రజాపాలన న్యూస్):  పట్టణంలో శ్రీనివాసనగర్, చిన్న, పెద్ద మునగాల, 43వ డివిజన్ లో, బస్వపురం, వెంకటగిరి, తీర్దాల, కొణిజర్లలో ఉచిత వృత్తి నైపుణ్యాల శిక్షణకార్యక్రమాలను అందిస్తున్న జె యస్ యస్ సెంటర్లో బాబు జగజీవన్ రామ్ జయంతి దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా డైరెక్టర్ వై. రాధాకృష్ణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళితుల అభివృద్ధికి, అంటరాని తనం రూపుమాపడానికి, విద్యను అందించటానికి, అసమానతలు తిలగించడానికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, సిఐటియు రాష్ట్ర నాయకులు యర్రా శ్రీకాంత్, మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు యస్ కె షకీనా అతిధులుగా పాల్గొన్నారు. మహిళలందరికి ఆటలు, పాటలు, వ్యాసరచన పోటీలు నిర్వహించి, వీటిలో ప్రతిభ కనపరచిన వారందరికీ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.