ప్రతి విద్యార్థి చదువుకోవాలి.. కేశవాపురం సర్పంచ్ వనిగండ్ల అలేఖ్య..

Published: Tuesday June 14, 2022

 తల్లాడ, జూన్ 13 (ప్రజాపాలన న్యూస్): ఐదేళ్లు నిండిన ప్రతి విద్యార్థి బడికి వెళ్లి చదువుకోవాలని కేశవాపురం గ్రామ సర్పంచ్ వనిగండ్ల అలేఖ్యఅశోక్ సూచించారు. సోమవారం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో చిన్నారులకు ఆమె అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారని, ప్రతి ఒక్కరు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీచర్లు నాగేశ్వరరావు, మాధవి, ఆశ వర్కర్ రజిత, వీఏవో అనసూర్య తదితరులు పాల్గొన్నారు.