నిరుపేదలకు ఆహార పొట్లాల అందజేత

Published: Monday November 22, 2021

రాయికల్ 21 నవంబర్ (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణంలో శనివారం రోజున శ్రీ రక్ష సేవాసమితి సభ్యులు  సిద్ధంశెట్టి శశికుమార్ స్వప్నల వివాహ వార్షికోత్సవం సందర్బంగా శ్రీ రక్ష సేవాసమితి ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న సంచార జాతి నిరుపేదలకు 100 ఆహార పొట్లాలను అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పెళ్లి రోజులకుగాని పుట్టినరోజులకు గాని విలాసాలకు ఖర్చు చేయకుండా పేద కుటుంబాలకు గానీ అలా వృద్ధాశ్రమాలకు గాని చేయూతనందించాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రక్ష సేవాసమితి అధ్యక్షులు కొత్తపల్లి గంగాధర్, ఆర్గనైజర్ సామల సతీష్, కోశాధికారి మోర నరేష్, ఉపాధ్యక్షులు కైరం శ్రీనివాస్ గౌడ్, బండి ప్రవీణ్ కుమార్ గౌడ్, కట్టెకోల రామనందం, కొడిమ్యాల రామక్రిష్ణ, భైరి సుకేష్, మచ్చ గణేష్, పెండేల గణేష్, గూడూరి నరేష్, వట్టిమల్ల సుధాకర్, ఉడుత రాంసురేష్, సేవాసమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.