డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

Published: Monday December 13, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 12 డిసెంబర్ ప్రజాపాలన : డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు. ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్  మెతుకు ఆనంద్ మోమిన్ పేట్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దబ్బని వెంకట్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. నిర్మాణంలో ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాలు లోపించకుండా కాంట్రాక్టర్లు జాగ్రత్త వహించాలన్నారు. నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించే విధంగా అధికారులు తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మోమిన్పేట్ పిఏసిఎస్ చైర్మన్ బండ విష్ణవర్ధన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.