ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ గా" రేగుంట మహేష్ ఎన్నిక
Published: Wednesday May 25, 2022
ఆసిఫాబాద్ జిల్లా మే 24 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఎమ్మార్పీఎస్ కేబీ ఆసిఫాబాద్ జిల్లా కో కన్వీనర్ గా రేగుంట మహేష్ మాదిగ ను సోమవారం ఎన్నికైనట్లు మంగళవారం రేగుంట మహేష్ మాదిగ విలేకరులతో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకంతో జిల్లా కో కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించి నియమించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ లకు కృతజ్ఞతలు తెలిపారు. నా నియామకానికి సహకరించిన జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాదిగల చిరకాల ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తూ జిల్లావ్యాప్తంగా మాదిగలను ఏకం చేసి నిరంతరం పనిచేసి రాష్ట్రంలోనే జిల్లాను ఉద్యమములో ప్రథమ స్థానంలో ఉండే విధంగా నా వంతు కృషి చేస్తానని అన్నారు.
Share this on your social network: