మండల వైద్యాధికారి ఆధ్వర్యంలో ఎన్సిడి కిట్స్ పంపిణీ. జన్నారం, అక్టోబర్ 28, ప్రజాపాలన:

Published: Saturday October 29, 2022

మంచిర్యాల జిల్లా జన్నారం మండల గ్రామపంచాయతీ పరిధిలో మండల వైద్యాధికారి డాక్టర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ఎన్సిడి కిడ్స్ పంపిణీ చేయడం జరిగిందని శుక్రవారం స్థానిక సర్పంచ్ భూషనావేణి గంగాధర్ గౌడ్, ఎంపీటీసీ ఎండి రియాజుద్దీన్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీపీ షుగర్ డయాబెటిక్ రోగులకు పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది, శుభక్త హెచ్ ఏ, కల్పన హెచ్ ఎ, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.