ఆదిత్య న్యూరో ఆస్పత్రిని ప్రారంభించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
Published: Saturday November 05, 2022
జగిత్యాల, నవంబర్ 04 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదిత్య న్యూరో ఆస్పత్రిని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది శాలువాతో సన్మానించారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు వైద్య సేవలందించేదుకు వైద్య వృత్తిని చేపడుతుండడం అభినందనీయమన్నారు. ఆధునిక సాంకేతికత వైద్యం నిరుపేదలకు చేరువ చేయాలని అన్నారు. జనాభాకు అనుగుణంగా మరింత మంది వైద్య వృత్తిలోకి రావాలని, జగిత్యాల జిల్లా ప్రజలకు అన్నిరకాల వైద్య నిపుణులు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. ఆయన వెంట డాక్టర్ గురువారెడ్డి ఉన్నారు.
Share this on your social network: