సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయ

Published: Saturday June 19, 2021

డిప్యూటీ డి.ఎం. హెచ్.ఓ. లక్ష్మీనారాయణ
మధిర ప్రజాపాలన ప్రతినిధి 18వ మున్సిపాలిటీ మధిర సేవ కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయమని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహాయ అధికారి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మధిర సిపిఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సిన్ కేంద్రంలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి టిఆర్ఎస్ యూత్ నాయకులు నల్లగట్ల సాయి ప్రణీత్ ఆర్థిక సహకారంతో ఏర్పాటుచేసిన బిర్యాని పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పని చేశారని ఆయన తెలిపారు. విధినిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి అన్నదానం ఏర్పాటు చేసిన నల్లగట్ల సాయి ప్రణీత్ ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మాటూరు పేట వైద్యులు వెంకటేష్ మధిర వైద్యులు శ్రీనివాస్ పాల్గొన్నారు.