బైకులు ఢీకొని ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు

Published: Friday March 12, 2021
మధిర, మార్చి 11, ప్రజాపాలన ప్రతినిధి: మధిర మండలం లోని  ఆత్కూరు గ్రామం దాటిన తర్వాత ఆంధ్ర కి తెలంగాణ కి సరిహద్దు లో రెండు బైకులు ఢీకొని ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయినవి కోట శంకర్ వయసు 32 సంవత్సరాలు ఇతను మధిర నుండి తన స్వగ్రామం తునికిపాడు వెళుతుండగా తెలంగాణ సరిహద్దు లో బైక్ ఢీకొనడంతో అతని ఎడమ చెవి నుండి తీవ్ర రక్తస్రావం జరుగుతుండటంతో అక్కడ ఉన్న స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో మధిర నుండి 108 అంబులెన్సు ఘటనా స్థలానికి చేరుకొని అతనిని అంబులెన్స్ లోకి ఎక్కించుకొని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గజ్జలకొండ శివ నాగేశ్వరరావు పైలెట్ చిట్టి రాజు ప్రధమ చికిత్స అందిస్తూ అతనిని మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది