తెలంగాణ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన శంకరపట్నం టీడీపీ నాయకులు శంకరపట్నం ఫిబ్రవరి 26 ప
Published: Monday February 27, 2023
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆదివారం నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం అనే కార్యక్రమం ప్రారంభోత్సవానికి శంకరపట్నం మండల కేంద్రం నుంచి టిడిపి నాయకులు హాజరయ్యారు. అనంతరం రాష్ట్రంలో టిడిపి పార్టీ నుంచి రెండవ అసెంబ్లీ టికెట్ను రజకులకు కేటాయించినందుకు గాను టిడిపి సీనియర్ నాయకుడు రాచర్ల సమ్మయ్య తెలంగాణ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ను పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని రజక సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన వెంట టిడిపి మండల అధ్యక్షుడు సయ్యద్ ఆరిఫ్, మండల కార్యవర్గ సభ్యుడు ఎండి సాబీర్, నాయకులు సముద్రాల సంపత్ ఉన్నారు.
Share this on your social network: