మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని శిక్షించాలి

Published: Saturday March 20, 2021

బిజెపి జిల్లా అధ్యక్షుడు జేబీ. పౌడెల్
రాస్తారోకో జాయింట్ కలెక్టర్ కు వినతి


ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, మార్చి19, ప్రజాపాలన : నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ముస్లిం యువకుని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు బేబీ పౌడెల్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భైంసా పట్టణంలో 4 సంవత్సరాల మైనర్ బాలికపై ముస్లిం యువకుడు అత్యాచారం చేశాడని, అయినప్పటికీ ఆయనపై కేసు నమోదు చేయడం లో పోలీసులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిందితుని అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు కొంగ సత్యనారాయణ, విశాల్, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.