రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి కేసిఆర్ ఒక భరోసా - జెడ్పీ చైర్ పర్సన్

Published: Thursday August 04, 2022

జగిత్యాల, ఆగస్టు 03 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జగిత్యాల అర్బన్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం యూనిట్ 2 నూతన కార్యవర్గ సభ్యులు జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ ను జెడ్పీ క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపినారు. అనంతరం జెడ్పీ చైర్ పర్సన్  ను  శాలువాతో సత్కరించారు. జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి కేసిఆర్ ఒక భరోసా అన్నారు. ఈ కార్యక్రమంలో కరబుజ రవీందర్, కార్యదర్శి అంజయ్య, ఉపాధ్యక్షుడు రామ స్వామీ, కిషన్, కోషాదికారి గంప రాములు, అసోసియేట్ అధ్యక్షులు బాల మురళి కృష్ణ,ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజేశ్వర్ రావు, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.