సెంట్రల్ లైటింగ్ పనులను పర్యవేక్షించిన మున్సిపల్ ఏ.ఈ ప్రసాద్

Published: Thursday June 09, 2022

రాయికల్, జూన్ 08 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణాన్ని సుందరంగా,అందంగా తీర్చిదిద్దాలని పురపాలక సంఘం అభివృద్ధి చేస్తున్నట్లు, దానిలో భాగంగా రాయికల్ పట్టణ కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల డివైడర్ సెంటర్ లైటింగ్ పనులను, డివైడర్లో మొక్కలు నాటుట కొరకు పోసిన మట్టిని మునిసిపల్ ఏ.ఈ  ప్రసాద్ పర్యవేక్షించి,లైట్లు బిగిస్తున్న కార్మికులకు  సూచనలు చేశారు.ఏ.ఈ తోపాటు అజయ్, రాయికల్ పట్టణ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ మోరరామ్మూర్తి, సోహెల్ తదితరులు ఉన్నారు.

 
 
 
Attachments area